కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రి వద్ద కాలనీలో బోరు ఏర్పాటు చేయించి నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఆస్పత్రి కాలనీలో గత కొన్ని రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. ఈ విషయాన్ని కాలనీవాసులు ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆదివారం బోరు ఏర్పాటు చేయించారు. సమృద్ధిగా నీళ్లు పడ్డాయి. నీటి సమస్య పరిష్కారమైంది. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.