కనిగిరి: పామూరు, కనిగిరి ప్రాంతాలలో జూన్ 13వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడి
మార్కాపురం జిల్లా పామూరులో 132 కేవీ లైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా శనివారం కనిగిరి మండలంలోని అన్ని గ్రామాలకు త్రీఫేస్ విద్యుత్ను రొటేషన్ పద్ధతిలో అందిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సుల్తాన్పురం, ఎన్.గొల్లపల్లి గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్ నిలిపేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అన్నారు.