కొండపి: టంగుటూరు మండలం జమ్మలపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం, పొగకు బ్యార్నీ దగ్ధమవడంతో ఏడు లక్షలు నష్టం
టంగుటూరు మండలం జమ్మలపాలెంలో కొత్తపల్లి వెంకటేశ్వర్లు రైతుకు చెందిన బ్యార్నీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున క్యూరింగ్ దశలో మొద్దు గోట్టంపై కర్ర పడటంతో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో మంటలు వేగంగా వ్యాపించి బ్యార్నీ పూర్తిగా కాలిపోయింది. పొగాకు 1500 కర్రలతోపాటు బ్యార్నీ నష్టం ఎక్కువగానే ఉంటుందని రైతు వెంకటేశ్వర్లు వాపోయాడు.