మార్కాపురం: రామచంద్రాపురం సమీపంలో టిప్పర్ కు విద్యుత్ వైర్లు తగిలి చెలరేగిన మంటలు
మార్కాపురం మండలం రామచంద్రాపురం సమీపంలో బుధవారం రాత్రి టిప్పర్ కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఓ వెంచర్ల మట్టి ఆన్ లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీజిల్ ట్యాంకరు టైర్లు ధ్వంసం అయ్యాయి. స్థానికులు అగ్జమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.