దర్శి: తనపై వస్తున్న వార్తలు అసత్యమని పేర్కొన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Jun 14, 2026 ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పై వస్తున్న వార్తలు ఆసత్యమని పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం కాటేజీ విషయంలో ఎవరు తమకు నోటీసు ఇవ్వలేదని రెండు రోజుల క్రితమే తాళాలను దేవస్థానం వారికి అందించామని చెప్పారు. తప్పు నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని నిరూపించ లేకపోతే మీరు క్షమాపణలు చెప్తారని ప్రశ్నించారు. కావాలని మా మీద బురద జల్లాలని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.