గిద్దలూరు: రాచర్ల మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు మిర్రర్లు ఏర్పాటుచేసిన ఎస్సై కోటేశ్వరరావు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై కోటేశ్వరరావు బుధవారం మిర్రర్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి మూలమలుపుల వద్ద ఈ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈ మిర్రర్లు ఏర్పాటు చేయడం జరిగిందని మిర్రర్లలో ఇరువైపులా వెళ్తున్న వాహనదారులకు వాహనాలు కనిపించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఎస్ఐ అన్నారు.