రాయదుర్గం: కణేకల్లు లో స్వచ్చత కార్యక్రమాలు చేపట్టిన అధికారులు
కణేకల్లు మండల కేంద్రంలో పంచాయతీ అధికారులు సిబ్బందితో కలిసి శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ మూడవ శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించి గ్రామాన్ని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు.