మార్కాపురం: భగత్ సింగ్ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించిన కమిషనర్ నారాయణరావు
మార్కాపురం భగత్ సింగ్ కాలనీ 16 వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రం చేసి రంగవల్లులు వేయించారు. మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని వివరించారు.