రాయదుర్గం: గుంతల మయంగా మారి తీవ్ర అసౌకర్యంగా మడేనహళ్లి ప్రధాన రహదారి, రోడ్డు వేయాలని స్థానికుల విజ్ఞప్తి
డి.హిరేహాల్ మండలంలోని జాజరకల్లు గేట్ నుంచి మడేనహళ్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులు ఏర్పడి తీవ్ర అసౌకర్యంగా మారిందని గ్రామస్తులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు కంకరతేలి ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లేందుకు అనువుగా లేదని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కర్నాటక బార్డర్ లో ఉన్న తమ ఊరికి తారు రోడ్డు వేయాలని బుధవారం విలేకరుల ద్వారా విజ్ఞప్తి చేశారు.