మార్కాపురం మండలం మాల్య వంతునిపాడు గ్రామంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యకు అధికారుల సమన్వయంతో పరిష్కారం లభించింది. గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత ఇండ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచిపోయింది. ఈ పరిస్థితిని ఎమ్మార్వో చిరంజీవి దృష్టికి చేరడంతో ఆయన స్వయంగా గ్రామానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆర్డీవో ఎమ్మార్వో తో కలిసి అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించారు