రాయదుర్గం: పట్టణంలో సుభాన్, నాగిరెడ్డి మద్య జరిగిన ఘర్షణపై ఇరువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
రాయదుర్గం పట్టణం లక్ష్మీబజార్ పెట్రోల్ బంకు వద్ద గత ఆదివారం TDP నాయకుడు సుభాన్, BJP నాయకుడు బోరువెల్ నాగిరెడ్డి ల మద్య జరిగిన ఘర్షణపై ఇరువురి మీద రాయదుర్గం UPS పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సుభాన్ ఇచ్చిన పిర్యాదుపై క్రైం నెంబర్ 118/2026 అండర్ సెక్షన్ 118(1) 115(2)351(2) BNS యాక్ట్ కింద బోరువెల్ నాగిరెడ్డి పై కేసు నమోదు చేశారు. అలాగే బోరువెల్ నాగిరెడ్డి ఇచ్చిన పిర్యాదుపై క్రై నెంబర్ 121/2026 అండర్ సెక్షన్ 351(2) 126 (2) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది.