దర్శి: ముండ్లమూరు మండలం లో పేకాట శిబిరం పై దాడి నిర్వహించిన పోలీసులు
Darsi, Prakasam | Jul 13, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల బండలో పేకాట నిర్వహిస్తున్న వారిపై పోలీసు అకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 18 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలంలో ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు అని హెచ్చరించారు.