గిద్దలూరు: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలో ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇన్చార్జులు టిడిపి నాయకులు మరియు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సమస్యలను గుర్తించడం వాటిని పరిష్కరించడం వంటి అంశాలపై మరియు రాజకీయ చరిత్ర అంశాలపై అవగాహన వంటి వర్క్ షాప్ నిర్వహించి ఎమ్మెల్యేలకు ఇన్చార్జిలకు నాయకులకు కీలక సూచనలు ఇచ్చారు..