మార్కాపురం: చింతకుంట్ల జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.