గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శోభాయాత్ర కార్యక్రమం జరిగింది. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాముడి భక్తి గీతాలతో హనుమాన్ పాటలతో ఆ ప్రాంగణం మారు మోగింది. జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ శోభాయాత్ర ముందుకు సాగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రామ, హనుమాన్ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.