కనిగిరి: గుడిపాడు కొత్తపాలెంలో వింత ఘటన, పెండ్లి కుమార్తెగా ముస్తాబైన పెండ్లి కుమారుడు
కనిగిరి మండలం గుడిపాడు కొత్తపాలెంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న ఈ వింత ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గుడిపాడు కొత్తపాలెంలో దాదిరెడ్డి కృష్ణారెడ్డి- లక్ష్మీదేవి ల వివాహం సందర్భంగా మొదల్ల గోత్రానికి చెందిన పెండ్లి కుమారుడు కృష్ణారెడ్డి పెళ్లి కుమార్తెగా ముస్తాబై ఊరేగింపుగా మండపానికి తరలి వెళ్లాడు. గ్రామంలోని సుమారు ఏడు గోత్రాల వారు ఈ ఆచారాన్ని పాటిస్తారని పెండ్లి కుమారుని కుటుంబ సభ్యులు తెలిపారు.