దర్శి: ముండ్లమూరు మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆమెకు అందజేశారు. కొన్ని సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను నిర్ణీత సమయంలో సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.