దర్శి: అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చిన దొనకొండ ఎస్సై రామకృష్ణ
Darsi, Prakasam | Jul 14, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ప్రజలకు ఎస్ఐ రామకృష్ణ పలు సూచనలు చేశారు. గ్రామాలలో అనుమాన వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి సమాచారం కూడా ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాల పట్ల సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల డ్రైవింగ్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.