దర్శి: దొనకొండ మండలంలోని ప్రజలకు పలు సూచనలు చేసిన ఎస్ఐ రామకృష్ణ
Darsi, Prakasam | May 31, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ప్రజలకు ఎస్ఐ రామకృష్ణ పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రతకు రాత్రిపూట ఆరుబయట నిద్రించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. బంగారు ఆభరణాలు నగదు భద్రపరచుకోవాలన్నారు. ఇంటికి తాళాలు వేసుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాలలో అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.