రాయదుర్గం: మహిళలు, బాలబాలికల బద్రతపై తాళ్ళకెరలో అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసు అధికారులు
మహిళలు, బాలబాలికల బద్రతపై గుమ్మగట్ట మండలంలోని తాళ్ళకెర గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. డిఎస్పీ రవిబాబు, రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ చిన్నరాయుడు, టిడిపి మండల కన్వీనర్ కాలువసన్నన్న, ఐసిడిఎస్ అధికారులు, గ్రామ పెద్దలు మాట్లాడారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమేనని, ఎవరైనా వాటిని ప్రోత్సహిస్తే చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ లలో శక్తి యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి ఆపద సమయాల్లో పోలీసు సహాయం పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని డిఎస్పీ తెలిపారు.