గిద్దలూరు: రాచర్ల మండల కేంద్రంలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న సరిగేసు సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. ప్రజలు పీర్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో యువతులు నిర్వహించిన కోలాటం అందర్నీ విశేషంగా ఆకర్షించింది. స్థానిక గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా తిలకించారు.