గిద్దలూరు: కొమరోలు మండలంలో జూన్ 21వ తేదీ ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జూన్ 21వ తేదీ ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శనివారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా పురుషోత్తమునిపల్లి, కే బొంతపల్లి, తాతిరెడ్డిపల్లి గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని అలానే తాటిచెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ముత్రాసు పల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్లు శ్రీనివాసులు తెలిపారు.