కొండపి: సింగరాయకొండలోని ఎలమందరెడ్డి నగర్ లో గంజాయి కలిగి ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని ఎలమందరెడ్డి నగర్ లో మంగళవారం గంజాయి కలిగి ఉన్న ఓ మహిళను ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి 430 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలానే గంజాయి సేవిస్తున్న మరో ఐదు మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.