దర్శి: కురిచేడులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.