రాయదుర్గం: పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో బైక్ ను డీకొన్న లారీ, ఇద్దరి పరిస్థితి విషమం
రాయదుర్గం పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో లారీ ద్విచక్ర వాహనాన్ని డీకొనింది. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న భూతయ్య దొడ్డి గ్రామానికి చెందిన భూతయ్య, పూజారి రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి వీరిని తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరుపై విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.