కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో పలు ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో పరిష్కారం కోసం పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో గ్రామపంచాయతీ అధికారులు బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. గత వారం రోజులుగా బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కదరంపల్లి, ములకలేడు, చెన్నంపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలు పరిష్కరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.