కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో నిరాశ జనకంగా మారిన పొగాకు విక్రయాలు, 197 పొగాకు బెళ్ళు తిరస్కరణ
కొండపి పొగాకు వేలం కేంద్రంలో మొదటి రౌండ్ ముగిసి నేడు 2 రౌండ్ కొనుగోలు ప్రారంభమైంది. ఏప్రిల్ 9న వేలం కేంద్రం ప్రారంభించారు. తిరస్కరణల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. నేడు జువ్విగుంట గ్రామ రైతులు 373 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 176 బేళ్లు కొనుగోలు చేశారు. 197 బేళ్లు తిరస్కరణ కాగా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోయారు.