గిద్దలూరు: పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన: గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్
ఈతకు వెళ్లకుండా తమ పిల్లలు పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సురేష్ విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో తల్లితండ్రులు తమ పిల్లలపై పూర్తిగా నిఘా ఉంచాలన్నారు. మీ ప్రాంతాలలోని బావులు, చెరువులు, వాగులలోకి పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అంతే కాకుండా ఉపాధి హామీ పథకం ద్వారా తవ్విన గుంటలలో ఈత సరదా తీర్చుకునేందుకు చిన్నారులు వెళుతూ ఉంటారని గతంలో ఇటు వంటి గుంటలలో ఈతకు వెళ్లి చిన్నారులు మృతి చెందిన సంఘటనలు సీఐ గుర్తు చేశారు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.