మార్కాపురం: కే కొత్తపల్లిలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం కే కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్యతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలవలు సగం మాత్రమే శుభ్రం చేసి వదిలేయడంతో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తుంది. దీంతో దోమలు విధురంమించి రోగాల బారిన పడుతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడంలేదని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.