ప్రకాశం జిల్లా సంతనూతలపాడు-ఒంగోలు రహదారిలో వంతెనపై భారీ గుంత ఏర్పడి నాలుగు నెలలైంది. ఈ రహదారి గుండా రోజూ వందలాది భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. 4 నెలలు అయినా ఎవరు పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరగా రహదారి గుంతకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.