ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామ శివారు ప్రాంతంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన పైనం రమేశ్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన రమేశ్ వేగంగా బైక్ నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొని చనిపోయాడని స్థానిక సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.