ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలంలోని కనపర్తి ఎత్తిపోతల పథకం సైపన్ లో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతులు ఒంగోలుకు చెందిన తోట భరత్ కుమార్ సాంబసని వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.