దర్శి: దర్శి లో 51.50 లక్షల సిసి రోడ్లను ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో 51.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధికి కోటమీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వార్డులో రహదారులు డ్రైనేజీ నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.