దర్శి: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దర్శి పురపాలక సంఘ కార్యాలయంలో కార్మికులు వినతి
Darsi, Prakasam | Jun 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో జూన్ 20వ తేదీ ధర్నా నిర్వహిస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.