రాయదుర్గం: రాయదుర్గంలో తాగునీటి కష్టాలు, ఖాళీ బిందెలతో 28వ వార్డు ప్రజల ధర్నా, ట్రాఫిక్ స్తంభన
రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అధికారులతో మూడు సార్లు సమీక్షా సమావేశాలు జరిపి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినా, పట్టణంలో తాగునీటి సమస్య తీరడం లేదు. సమస్య తీరకపోగా మరింత జటిలంగా మారింది. కణేకల్లు దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో రెండు నెలలకు సరిపడా నీరు ఉన్నప్పటికీ, పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడికక్కడ ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మహిళలు ధర్నా చేయడం నిత్యకృత్యంగా మారింది. గత నెల రోజులుగా తాగునీటి సమస