యర్రగొండపాలెం: బోయలపల్లి ఎస్సీ పాలెం లో నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి ఎస్సీ పాలెం లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు దీపాన్ శేషి మృతి చెందారు నీటి కుంటలో కాళ్లు కడుకుందామని వెళ్ళగా కాలుజారి అందులో పడిపోయారు. కుంట దాదాపు 12 అడుగులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు వారిని గమనించిన స్థానికులు బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.