చారిత్రిక,భౌగోళిక,క్షేత్ర ప్రాశస్త్యాన్ని కాదని అధికారం ముసుగులో పవిత్ర ఆలయాలను,వాటి ఆలనాపాలనలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అధికార కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి మంత్రి డోలా బాల వీరంజనేయులుకి తగదని మార్కాపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు హితవు పలికారు. పొదిలి గ్రూప్ దేవాలయ వ్యవస్థను, పృధులగిరిపై వెలసిన నరసింహ స్వామి క్షేత్రాన్ని మర్రిపూడి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న గ్రూప్ దేవాలయాల్లో కలుపుతారనే అంశంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. పొదిలి కేంద్రంగా సాగుతున్న గ్రూప్ దేవాలయాల పర్యవేక్షణ,పాలనను తొలగించి, కొండపిలో కలపడం కరెక్ట్ కాదన్నారు.