కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో తగ్గిన తిరస్కరణలు, అయినా కానీ రైతులు అసంతృప్తి
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగకు బెల్లు తిరస్కరణలు తగ్గిన రైతులలో అసంతృప్తి తగ్గడం లేదు. 24 గంటల వ్యవధిలో మండలంలోని పొగాకు రైతులు 581 పొగాకు బెల్లు రైతులు వేలానికి తీసుకురాగా ఇందులో 118 పొగాకు బెల్లు తిరస్కరణకు గురయ్యాయి. కేజీ పొగాకు ధర రూ.222.10 నుంచి రూ.180 ధర పలకడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతులు విమర్శించారు.