రాయదుర్గం: గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలి : సిఐ జయనాయక్
గ్రామాలలో ఎటువంటి గొడవలు అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రశాంతంగా జీవించాలని రాయదుర్గం సిఐ జయనాయక్ సూచించారు. రాయదుర్గం మండలం కొంతానపల్లి గ్రామంలో శనివారం రాత్రి పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్ జోలికి పోవద్దని యువతకు సూచించారు. బాల్య వివాహాలు చేయవద్దని, పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపి చదివించి ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగుతున్నాయని గమనిస్తే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు.