మార్కాపురం: జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణకు తగినంత విశ్రాంతి తీసుకొని వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణకు వాహనదారులు కృషి చేయాలని శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి వాహనదారులు విశ్రాంతి తీసుకొని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్ళాలన్నారు. తగినంత నీరు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని అలసట వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులను ఎస్పీ హెచ్చరించారు.