దర్శి: దర్శి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు కాంట్రాక్టు వర్కర్లు నిరసన
ప్రకాశం జిల్లా దర్శి ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. వర్కర్లకు సుమారు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తమ సమస్యను పరిష్కరించాలని వారి కోరారు. డి ఈ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.