రాయదుర్గం: గుండ్లపల్లి వద్ద ప్రమాదకరంగా హైవే రోడ్డు, నిర్వాహణ గాలికొదిలేసిన అధికారులు
జాతీయ రహదారులపై టోల్ వసూలు చేస్తున్న అధికారులు రోడ్ల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. రాయదుర్గం-అనంతపురం హైవేలో గుండ్లపల్లి వంతెనపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. స్లాబ్లోని ఇనుప కడ్డీలు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయి. మంగళవారం స్కూటీపై వెళ్తున్న వ్యక్తి గోతిలో పడి అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.