గిద్దలూరు: కంభం మండలం పోరుమామిళ్ల పల్లి గ్రామంలో పిడుగులకు ఈదురు గాలులకు కూలిపోయిన భారీ మామిడి వృక్షాలు
మార్కాపురం జిల్లా కంభం మండలం పోరుమామిళ్లపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులకు రెండు మామిడి పండ్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రెండు చెట్లు కూలిపోవడంతో తాను ఆర్థికంగా నష్టపోయానని రైతు తెలిపాడు. మామిడి చెట్టుకు ఉన్న మామిడి పండ్లన్నీ రాలిపోవడంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు . పిడుగులకు దాటికి మామిడి చెట్లు కూలిపోయినట్లు రైతు చెబుతున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.