ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని ట్రంక్ రోడ్డు దెబ్బ తినడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళవారం కొందరు వ్యక్తులు దెబ్బతిన్న రోడ్డు ఫోటోలను తీసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. మంత్రి స్వామి ఇలాఖలోనే ఈ విధంగా రోడ్లో ఉండడం ఏమిటి అని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మరింత ఇబ్బందులు తలెత్యాయని అంతేకాకుండా గుంతలలో నీరు నిలబడడం వల్ల గుంతలు ఎంత లోతు ఉన్నాయి అనేది అంచనా వేయలేకపోతున్నట్లు ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.