కొండపి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు కృషిచేసిన మాజీ మంత్రి కొండపి వైసిపి ఇన్చార్జ్ ఆదిమూలం సురేష్
ప్రకాశం జిల్లా కొండేపి వైసిపి ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ ఆదివారం ఎర్రగొండపాలెం వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సహాయాన్ని అందించారు. ఎర్రగొండపాలెం సమీపంలో కారు బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఘటనలో ఒకరు మృతిచెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. అటువైపు నుంచి వెళ్తున్న మాజీ మంత్రి వెంటనే స్పందించి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించేందుకు కృషి చేశారు. తర్వాత వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు.