రాయదుర్గం: దేవిరెడ్డిపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం, బాలుడి సహా ముగ్గురు పరిస్థితి విషమం
రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై దేవిరెడ్డిపల్లి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రాయదుర్గానికి చెందిన డ్రైవింగ్ స్కూల్ కారు యూ-టర్న్ తీసుకుంటుండగా, గుమ్మగట్ట మండలం NK దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల వీరభద్ర, గర్భిణిగా ఉన్న అతని భార్య గంగమ్మ, 2 ఏళ్ల కుమారుడు సూర్య బైక్పై వెళుతూ కారును ఢీకొన్నారు. కళ్యాణదుర్గం RDT ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్లో హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.