కొండపి: సింగరాయకొండలో కూటమి ప్రభుత్వం సారధ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న బీసీ, చేనేత జైల్లా శాఖ మంత్రి సవిత
గ్రామాల్లో సమస్యలు అలాగే ఉన్నాయని ఎక్కడికి వెళ్లినా తాగునీటి సమస్య, సీసీ రోడ్ల గురించి అడుగుతున్నారని మంత్రి సవిత అన్నారు. గత ప్రభుత్వ పాలన గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆమె వివరించారు. సింగరాయకొండ సభలో మాట్లాడిన ఆమె.. 14-19లో అభివృద్ధి చూపించామని, ఒక్కఛాన్స్ అంటూ 19-24లో అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం NRGSతో కోట్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు.