యర్రగొండపాలెం: గంగపాలెం చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం గ్రామంలో స్వర్ణాంధ్ర సత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 44 లక్షలతో చేపట్టిన ఈ పనులకు టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీరు అందుతుందని ఆయన అన్నారు. గట్టుల బలోపేతం మట్టి తొలగింపు శుభ్రత పనులు చేపడుతున్నట్లు తెలిపారు.