కొండపి: సింగరాయకొండ కుసుమ హరినాధ ఆలయ సమీపంలో ఈదురు గాలుల వల్ల నేలకొరిగిన వృక్షం, స్థానికులకు తప్పిన ప్రాణాపాయం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని కుసుమ హరినాధ ఆలయ సమీపంలో శనివారం భారీ ఇదురు గాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు పడిపోయే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు స్తంభం పై పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లుగా స్థానికులు తెలిపారు. అధికారులు అతి త్వరగా మరమ్మత్తులు చేపట్టి విద్యుత్ సరఫరాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు.