కొండపి: సింగరాయకొండలో ఓ ఇంట్లో భారీ చోరీ, బంగారం నగదు అపహరణ, క్లూస్ టీం ను రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. లలితమ్మ కు చెందిన ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు బంగారాన్ని దోచుకు వెళ్లారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లిన బాధితురాలు ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది చోరీ జరిగిన విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. నగదు బంగారం ఎంత మొత్తంలో పోయిందో తెలియవలసి ఉంటుంది. అలానే క్లూస్ టీం ని రంగంలోకి దించే దర్యాప్తు చేస్తున్నామని సీఐ హజరతయ్యా తెలిపారు.